పవన్ 'తొలిప్రేమ' దర్శకుడి రీఎంట్రీ... బెల్లంకొండ గణేష్ తో రొమాంటిక్ కామెడీ
- బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కొత్త సినిమా
- ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్న ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ
- సంగీతం సమకూరుస్తున్న చార్ట్బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో
- ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం.. ప్రారంభించిన వీవీ వినాయక్
- గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మౌనిక రెడ్డి నిర్మాణం
యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక కొత్త రొమాంటిక్ కామెడీ చిత్రం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నాడు పవన్ కల్యాణ్ తో 'తొలిప్రేమ' వంటి బ్లాక్ బస్టర్ సహా 'డార్లింగ్' వంటి ఎన్నో విజయవంతమైన ప్రేమకథా చిత్రాలను అందించిన ఎ. కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మౌనిక రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు ముగ్గురు ప్రముఖ టెక్నీషియన్లు కలిసి పనిచేస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కరుణాకరన్ తన మార్క్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తుండగా, 'జాతిరత్నాలు' చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు. ఆయన రాసే వినూత్నమైన హాస్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. వీరికి తోడుగా, చార్ట్బస్టర్ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయిక సినిమాపై అంచనాలను పెంచుతోంది.
హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ కెమెరా స్విచాన్ చేయగా, చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాకు ముగ్గురు ప్రముఖ టెక్నీషియన్లు కలిసి పనిచేస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కరుణాకరన్ తన మార్క్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తుండగా, 'జాతిరత్నాలు' చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు. ఆయన రాసే వినూత్నమైన హాస్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. వీరికి తోడుగా, చార్ట్బస్టర్ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయిక సినిమాపై అంచనాలను పెంచుతోంది.
హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ కెమెరా స్విచాన్ చేయగా, చిత్రబృందానికి స్క్రిప్ట్ను అందజేశారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.